విజయం నాదే: పట్టబద్రుల స్థానంలో చెల్లని ఓట్లపై వాణీదేవి అసహనం

Published : Mar 19, 2021, 03:03 PM IST
విజయం నాదే: పట్టబద్రుల స్థానంలో చెల్లని ఓట్లపై వాణీదేవి అసహనం

సారాంశం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు చెల్లకపోవడంపై హైద్రాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన వాణీదేవి అసహనం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు చెల్లకపోవడంపై హైద్రాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన వాణీదేవి అసహనం వ్యక్తం చేశారు.

శుక్రవారం నాడు  సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఉన్నత విద్యావంతులు సరిగా ఓటు హక్కును వినియోగించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

also read:హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు: వాణీదేవి ముందంజ

తాము నేర్పిన చదువు ఇదేనా అనే బాధ కలుగుతోందన్నారు.  కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు.పార్టీ అన్ని రకాలుగా తనకు సహకరించిందని ఆయన చెప్పారు. ఈ స్థానంలో తాను విజయం సాధిస్తానని ఆమె ధీమాను వ్యక్తం చేశారు.పీవీ నరసింహారావుతో పాటు తన క్రెడిబిలిటీ, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉండడం కారణంగానే తాను విజయం వైపు దూసుకు వెళ్తున్నానని ఆయన చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !