చర్లపల్లి సెంట్రల్ జైలు సిబ్బందిపై రాజాసింగ్ భార్య తీవ్ర ఆరోపణలు..

Published : Sep 23, 2022, 01:00 PM IST
చర్లపల్లి సెంట్రల్ జైలు సిబ్బందిపై రాజాసింగ్ భార్య తీవ్ర ఆరోపణలు..

సారాంశం

Raja Singh: మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. పోలీసులు ఆయనపై పీడీయాక్ట్ పెట్టి  అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన భార్య చర్లపల్లి సెంట్రల్ జైలు సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు.   

Cherlapally central jail : ఆగస్టు 25 నుంచి జైలులో ఉన్న తన భర్తకు చర్లపల్లి సెంట్రల్ జైలు అధికారులు మంచం, కుర్చీ, వార్తాపత్రికలు వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భార్య ఉషాబాయి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్.. మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర దుమారం రేగింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఆయనకు వ్యతిరేకంగా చాలా చోట్ల పోలీసులు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మరింత వివాదం రాజుకుంది. పాతబస్తీతో పాటు అనేక ప్రాంతాల్లో ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. బీజేపీ, రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినదించారు. ఈ ఉద్రిక్తతల క్రమంలో... మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. పోలీసులు ఆయనపై పీడీయాక్ట్ పెట్టి  అదుపులోకి తీసుకున్నారు. ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద నిర్బంధంలో ఉన్నారు.

అయితే, చర్లపల్లి జైలులో ఉన్న రాజాసింగ్ కు కనీస సౌకర్యాలు జైలు అధికారులు కల్పించడం లేదని ఆయన భార్య ఉషాబాయి ఆరోపిస్తున్నారు. తన భర్తకు కనీస సౌకర్యాలు కల్పించేలా ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం), జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు.  "రాజాసింగ్ ఎమ్మెల్యే అయినందున తెలంగాణ జైళ్ల నిబంధనల ప్రకారం ప్రత్యేక తరగతి ఖైదీగా పరిగణించాలి. ఆయన ఎన్నికైన ప్రజాప్రతినిధి. కాబట్టి, ఖైదీ తన కుటుంబ సభ్యులు, ఓటర్లు, శ్రేయోభిలాషులతో వారానికి రెండుసార్లు సంభాషించేలా అధికారులను కోర్టు ఆదేశించవచ్చు” అని ఆమె తాజా పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.  అంతకుముందు, రాజా సింగ్‌ను పీడీ చట్టం కింద నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌లో పెండింగ్‌లో ఉంది. దానిపై కోర్టు పోలీసు శాఖ ప్రతిస్పందనను కోరింది. జైళ్ల చట్టంలోని సెక్షన్ 27,31,33, 40 ప్రకారం తెలంగాణ జైళ్ల నిబంధనలలోని ఇతర నియమాలతో పాటు, ఖైదీ, ఎన్నికైన ప్రజాప్రతినిధి, కొన్ని ప్రాథమిక సౌకర్యాలకు అర్హులు కానీ ఏదీ అనుమతించబడదు. అతను బయటి నుండి ఆహారం పొందటానికి, తన స్వంత బట్టలు ధరించడానికి కూడా అర్హుడని ఆమె పేర్కొంది.

అంతేకాకుండా, జైలు ఖైదీల నుండి తన భర్తపై భౌతిక దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ. రాజాసింగ్ కు ప్రత్యేక భద్రత కల్పించాలని కోర్టును అభ్యర్థించింది. గురువారం ఈ రిట్ పిటిషన్‌ను జస్టిస్ కన్నెగంటి లలిత నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్థన మేరకు కేసును సెప్టెంబర్ 28కి వాయిదా వేసింది. ఇదిలావుండగా, గతంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ సైతం మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది అంతర్జాతీయంగా అలజడిని రేపింది. ఏకంగా భారత్ క్షమాపణలు చెప్పాలని గల్ఫ్ దేశాలు డిమాండ్ చేశాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్