
హైదరాబాద్: హైద్రాబాద్ బహదూర్పురలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం Hijab తో రావొద్దని విద్యార్ధినిలకు తెలిపింది. దీంతో స్కూల్ వద్ద విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులు బుధవారంనాడు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు lathi charge చేశారు.
Bahadurpura వద్ద ఉన్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం Schoolలోకి హిజాబ్ ను అనమతించకపోవడంతో విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులు ఇవాళ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. స్కూల్లోకి అనుమతివ్వాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్కూల్ వద్ద ఆందోళన చేస్తున్న వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. కానీ ఆందోళనకారులు వినిపించుకోలేదు. పరిస్థితి చేయిదాటిపోయే పరిస్థితి రావడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. పోలీసుల లాఠీచార్జీతో పలువురికి గాయాలయ్యాయి.
కర్ణాటక రాష్ట్రంలో మొదలైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. హైద్రాబాద్ లో కూడా కర్ణాటకలో ఆందోళనలు చేసే సమయంలో హిజాబ్ కు మద్దతుగా నిరసనలు సాగాయి.
ఈ ఏడాది జనవరి 1న కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న ప్రభుత్వ కాలేజీలో ఈ హిజాబ్ వివాదం రాజుకుంది. ఆరుగురు ఓ వర్గానికి చెందిన బాలికలు హిజాబ్ ధరించి క్లాసులకు హాజరయ్యారు. దీనిని కాలేజీ మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు. దీంతో ఈ వివాదం మొదలైంది. ముస్లిం బాలికల హిజాబ్ ధరించి రావడంతో కొంత మంది మరో వర్గం విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి క్లాసులకు రావడం మొదలు పెట్టింది. దీంతో రెండు ఉడిపిలో వర్గాల మధ్య మొదలైన ఈ సమస్య రాష్ట్రం మొత్తం వ్యాపించింది. ఇది పెద్ద ఆందోళనకు దారి తీసింది.
అయితే ఫిబ్రవరి 9న ఉడిపికి చెందిన ముస్లిం బాలికలు కోర్టుకు వెళ్లారు. హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించడానికి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి, జస్టిస్ జెఎం ఖాజీ, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్లతో కూడిన పూర్తి బెంచ్ ఏర్పాటు అయ్యింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును రోజూ విచారించింది. ఆందోళనల కారణంగా మూతపడిన విద్యాసంస్థలను తిరిగి తెరవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వెలువడే వరకు విద్యార్థులు క్లాస్రూమ్లో హిజాబ్ లేదా కాషాయ కండువాలు ధరించడాన్ని కూడా కోర్టు నిషేధించింది.
హిజాబ్ వివాదంపై 11 రోజుల పాటు హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం హైకోర్టు ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఈ తీర్పు వెలవడే వారం రోజుల ముందు నుంచి బెంగళూరు వంటి ముఖ్య పట్టణాల్లో పెద్ద సమావేశాలను కర్ణాటక ప్రభుత్వం నిషేదించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నందున వివాదానికి కారణమైన దుస్తులను ప్రభుత్వం ఈ ఏడాది పిబ్రవరి 5న నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 15న కర్ణాటక హైకోర్టు విద్యా సంస్థల్లో హిజాబ్ అవసరం లేదని తేల్చి చెప్పింది.ఈ తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.