స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి: ముగ్గురు క్యూనెట్ ప్రతినిధుల అరెస్ట్

By narsimha lodeFirst Published May 30, 2023, 12:00 PM IST
Highlights

సికింద్రాబాద్  స్వప్నలోక్   కాంప్లెక్స్ లో  ఆరుగురు మృతికి  కారణమైన ముగ్గురు క్యూనెట్  సంస్థ  ప్రతినిధులను  అరెస్ట్  చేశారు  పోలీసులు.  


హైదరాబాద్:  సికింద్రాబాద్  స్వప్నలోక్ కాంప్లెక్స్  లో ఆరుగురు మృతికి  కారణమైన  క్యూనెట్ సంస్థకు  చెందిన  ముగ్గురిని  మంగళవారంనాడు  పోలీసులు  అరెస్ట్  చేశారు. ఈ  ఏడాది  మార్చి  16వ తేదీ  రాత్రి  స్వప్నలోక్ కాంప్లెక్స్ లో   జరిగిన  అగ్ని ప్రమాదంలో  ఆరుగురు మృతి చెందారు.  స్వప్నలోక్ కాంప్లెక్స్  లోని  7,8  అంతస్తుల్లో  అగ్ని ప్రమాదం  జరిగింది.   ఈ ప్రమాదంలో  క్యూనెట్  సంస్థలో  పనిచేసే  ఆరుగురు  మృతి చెందారు. 

 మల్టీ లెవల్  మార్కెటింగ్  పేరుతో క్యూనెట్  సంస్థ  కార్యకలాపాలు  చేపట్టింది.   ఈ సంస్థలో  పెట్టుబడులు పెడితే  ఉద్యోగాలు  కల్పిస్తామని  నిరుద్యోగులకు  ఆశలు  కల్పించిందనే  ఆరోపణలున్నాయి. ఈ ప్రచారం   ఆధారంగా  నిరుద్యోగులు  కొందరు  క్యూనెట్  సంస్థలో  పెట్టుబడులు  పెట్టి  ఉద్యోగాలు  పొందారని  ప్రచారం సాగుతుంది. ఈ విషయమై  విచారణ  నిర్వహించి    క్యూనెట్ కు  చెందిన  ముగ్గురిని  ఇవాళ  పోలీసులు అరెస్ట్  చేశారు. 

click me!