ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ పేరుతో మోసాలు: హైద్రాబాద్ లో 9 మంది సభ్యుల ముఠా అరెస్ట్

Published : Jan 30, 2023, 10:04 PM IST
ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ పేరుతో మోసాలు: హైద్రాబాద్ లో 9 మంది సభ్యుల ముఠా అరెస్ట్

సారాంశం

ఆన్ లైన్ గేమింగ్ , బెట్టింగ్ కి పాల్పడుతున్న 9 మంది సభ్యుల ముఠాను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్  చేశారు. నిందితుల నుండి  రూ. 24 కోట్లను పోలీసులు సీజ్ చేశారు.    


హైదరాబాద్: ఆన్ లైన్ గేమింగ్,బెట్టింగ్  పేరుతో  మోసాలకు  పాల్పడుతున్న  ముఠాను  హైద్రాబాద్  సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్  చేశారు. ఈ ముఠా నుండి  రూ. 24 కోట్ల నగదును  పోలీసులు సీజ్ చేశారు. నిందితుల నుండి  భారీగా బ్యాంకు  పాస్ పుస్తకాలు, చెక్ బుక్ లను  కూడా   సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్  చేశారు. 

ఆన్ లైన్ గేమింగ్,  బెట్టింగ్  పేరుతో్   ఈ ముఠా  పెద్ద ఎత్తున డబ్బులను దోచుకుందని  పోలీసులు తెలిపారు.  హైద్రాబాద్ నగరంలోని ఓ కాంట్రాక్టర్  కొడుకు  నుండి  రూ. 94 లక్షలు , ఓ కానిస్టేబుల్  మనువడి  నుండి  రూ. 65 లక్షలను ఈ ముఠా దోచుకుంది.  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన  హర్షవర్ధన్ అనే విద్యార్ధి  ఆన్ లైన్ గేమింగ్ లో  రూ. 98 లక్షలు పోగొట్టుకున్నారు. హైద్రాబాద్, సైబరాబాద్ లలో   నమోదైన కేసుల ఆధారంగా  సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు  చేసి ఈ ముఠా సభ్యులను అరెస్ట్  చేశారు. 

ఈ ముఠాలోని తొమ్మిది మందిని అరెస్ట్  చేసినట్టుగా  సైబర్ క్రైమ్ పోలీసులు  ఇవాళ తెలిపారు.  ఈ ముఠాకు సంబంధించిన వివరాలను   మీడియాకు వివరించారు పోలీసులు.  నిందితుల నుండి  193 మొబైల్ ఫోన్లు,  21 ల్యాప్ టాప్ లు , డెబిట్ కార్డులు, పీఓఎస్ మెషన్లను  పోలీసులు సీజ్ చేశారు. ఆన్ లైన్ లోన్ యాప్ లు, ఉద్యోగాల ఇప్సిస్తామని  మోసం చేసే వారిపట్ల జాగ్రత్తగా  ఉండాలని కూడా  పోలీసులు సూచిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu
Entrance Exams : పదో తరగతి తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలా..? అయితే తప్పక రాయాల్సిన ప్రవేశ పరీక్షలివే