వరదనీటిలో గల్లంతు: కిలో బంగారం మాయం, బ్యాగ్ లభ్యం

Published : Oct 22, 2020, 03:20 PM ISTUpdated : Oct 22, 2020, 03:38 PM IST
వరదనీటిలో గల్లంతు: కిలో బంగారం మాయం, బ్యాగ్ లభ్యం

సారాంశం

నగరంలోని బంజారాహిల్స్ లో ఈ నెల 9వ తేదీన  వరదలో కొట్టుకుపోయిన నగల బ్యాగ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 1 కోటి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు.  


హైదరాబాద్:  నగరంలోని బంజారాహిల్స్ లో ఈ నెల 9వ తేదీన  వరదలో కొట్టుకుపోయిన నగల బ్యాగ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 1 కోటి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు.

also read:హైద్రాబాద్ వరద నీటిలో కొట్టుకుపోయిన కిలోన్నర బంగారం: గంటల తర్వాత దొరికింది

ఓ కస్టమర్ కు బంగారు ఆభరణాలను చూపించేందుకు ఓ జ్యూయలరీ సంస్థలో  పనిచేస్తున్న సేల్స్ మెన్ బైక్ పై నగల బ్యాగ్ పెట్టుకొని వచ్చాడు.అయితే  నగల బ్యాగ్ వరదలో కొట్టుకుపోయిందని ఆయన యజమానికి ఫిర్యాదు చేశాడు. ఈ నగల షాపులో పనిచేసే ఇతర సిబ్బంది, పోలీసులు కూడ వరద నీటిలో నగల బ్యాగ్ కోసం గాలించారు.

ఈ నెల 10వ తేదీన నగల బ్యాగు లభ్యమైంది. అయితే ఈ బ్యాగులో నగలు లేకపోవడం మరింత  అనుమానాలకు దారి తీసింది.ఈ విషయమై పోలీసులు సేల్స్ మెన్ తో పాటు పలువురిని పోలీసులు విచారించారు. ఈ విచారణలో నిందితులు  అసలు విషయాన్ని ఒప్పుకొన్నారు.  

ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా బంజారాహిల్స్ పోలీసులు ప్రకటించారు. నిందితుల నుండి కోటి రూపాయాల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌కు 20 కి.మీల దూరంలో నీటిపై తేలియాడే కాటేజీలు.. ఇక మాల్దీవుల‌తో ప‌నేంటి?
IMD Rain Alert : ఈ వీకెండ్ హైదరాబాద్ లో కూల్ కూల్ వెదర్.. ఈ జిల్లాల్లో రెండుమూడు రోజులు వర్షాలే