Hyderabad MMTS: హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. MMTS ఛార్జీలు 50% తగ్గింపు..

Published : May 03, 2022, 05:22 PM IST
Hyderabad MMTS: హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. MMTS ఛార్జీలు 50% తగ్గింపు..

సారాంశం

Hyderabad MMTS:  సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్లలోని సబర్బన్‌ సెక్షన్లలో ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సింగిల్‌ జర్నీ ఫస్ట్‌ క్లాస్‌ ఛార్జీలు తగ్గనున్నాయి. దాదాపు 50 శాతం త‌గ్గిన ఛార్జీల పూర్తి వివరాలను దక్షిణ మధ్య రైల్వే అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేసింది.  

MMTS ticket fare: హైద‌రాబాద్ లో న‌గ‌రంలో ప్ర‌యాణాన్ని మ‌రింత సుల‌భ‌త‌రంగా మార్చిన ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్)  అధికారులు.. ప్ర‌యాణికుల‌కు మ‌రో గుడ్ న్యూస్ చెప్పారు. న‌గ‌రంలోని ఎంఎంటీఎస్ ఛార్జీలను తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ క్లాస్‌ ఛార్జీలను 50 శాతం మేర తగ్గించారు.  MMTS ఛార్జీలను మే 5 నుండి ఫస్ట్ క్లాస్ సింగిల్ జర్నీ ప్రయాణికులకు 50 శాతం వరకు తగ్గించనున్నారు. మే 5 నుంచి సబర్బన్ రైలు సర్వీసుల్లో ఫస్ట్ క్లాస్ బేసిక్ ఛార్జీలను త‌గ్గిస్తూ.. రైల్వే మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. సబ్-అర్బన్ సెక్షన్ల మీదుగా MMTS రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు సింగిల్ జర్నీకి ఫస్ట్ క్లాస్ బేస్ ఛార్జీలు తగ్గించనున్నారు. 

కోవిడ్ విధించిన లాక్‌డౌన్ తర్వాత సేవలను తిరిగి ప్రారంభించినప్పటి నుండి దక్షిణ మధ్య రైల్వే సబ్-అర్బన్ ప్రయాణీకుల ప్రయోజనం కోసం MMTS సేవల సంఖ్యను క్రమంగా పెంచుతోంద‌ని SCR ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం, ఫలక్‌నుమా-సికింద్రాబాద్-హైదరాబాద్-బేగంపేట్-లింగంపల్లి-తేలాపూర్-రామచంద్రపురం విభాగాల్లో 29 రైల్వే స్టేషన్‌లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్ల మేర 86 సర్వీసులు నడపబడుతున్నాయ‌ని తెలిపింది. MMTS సెక్షన్‌లోని వివిధ స్టేషన్‌లలో పీక్ అవర్ ట్రాఫిక్‌ను పరిగణనలోకి తీసుకొని ప్రయాణీకుల ప్రయాణ అవసరాలను తీర్చడానికి ఈ సేవలు ప్రణాళిక చేయబడ్డాయి. సబ్-అర్బన్ ప్రయాణీకులకు వేగవంతమైన మరియు చౌకైన రవాణా మార్గాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రయాణీకులకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రయోజనాన్ని పొందాలని ప్రయాణీకులకు విజ్ఞప్తి చేస్తూ, SCR జనరల్ మేనేజర్ (ఇన్-ఛార్జ్) అరుణ్ కుమార్ జైన్ వివ‌రాలు వెల్ల‌డించారు. 

 

 

MMTS ఫస్ట్ క్లాస్‌లో తగ్గిన ఛార్జీలు (మే 5 నుండి అమలులోకి వస్తాయి) :

దూరం స్లాబ్ (కి.మీ.లో)

ప్రస్తుత ఛార్జీలు

మే 5 నుండి ఛార్జీలు
1 – 10రూ. 50రూ. 25
11 – 15రూ. 65రూ. 35
16 – 25రూ. 100రూ. 55
26 – 35రూ. 145రూ. 85
36-45రూ. 155రూ. 90

ఇటీవల తెలంగాణ  ఆర్టీసీ బస్సు  చార్జీలను పెంచింది. ఆ తర్వాత ప్యాసింజర్ సెస్‌ పేరుతో ఆర్టీసీ ప్రయాణికులపై భారాన్ని మోపింది. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌ బస్సుల్లో ప్రతి ప్రయాణికుడి నుంచి సాధారణ చార్జీలతో పాటు అదనంగా ప్యాసింజర్‌ సెస్‌ రూ.5-10 వరకు వసూలు చేయాలని నిర్ణయించింది.  ఈ మేరకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ. 5 చొప్పున.. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ. 10 వరకు టికెట్ రేట్లు పెంచారు. దీంతో ప్రయాణికులపై భారం మరింతగా పెరింది. ఇక తాజాగా ఎంఎంటీఎస్ చార్జీలు తగ్గించడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu