
హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తమ ఇంట్లోనే వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ వీడియోను ఎక్స్లో పోస్టు చేశారు. అంతేకాదు, అందుకు సంబంధించి ఓ వివరణ కూడా పెట్టారు.
వీడియోలో చూపిన విధంగా ఇంటిలోనే వినాయకుడిని నిమజ్జనం చేశానని సీవీ ఆనంద్ తెలిపారు. అనంతరంలో కుండీలోని నీటిలో వినాయకుడు కరిగిపోయాడు. ఆ కుండీలో మిగిలిన మట్టిలో తన భార్య ఓ మొక్కను నాటినట్టు వివరించారు. ఇలా చేయడం ద్వారా పర్యావరణానికి హానీ కలగకుండా నడుచుకోవడమే కాదు, మొక్కల సంఖ్యనూ పెంచినవారం అవుతామని తెలిపారు.
ఈ సారి గణపతి నిమజ్జన ఊరేగింపుల్లో హైదరాబాద్లో పోలీసులు ఓ అడుగు ముందుకు వేసి హుషారుగా కాలు కదిపారు. భక్తులతోపాటు ఊరేగింపులో వారు కూడా భాగస్వామ్యం పంచుకున్నారు. భక్తులతో కలిసి స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి.