వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసిన సీపీ సీవీ ఆనంద్.. ఆ మట్టిని ఏం చేశారంటే?

Published : Sep 28, 2023, 07:07 PM IST
వినాయకుడిని ఇంట్లోనే నిమజ్జనం చేసిన సీపీ సీవీ ఆనంద్.. ఆ మట్టిని ఏం చేశారంటే?

సారాంశం

హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ వినాయకుడిని ఇంటిలోనే నిమజ్జనం చేశారు. ఓ కుండీలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టి నీటిని పోశారు. మట్టి విగ్రహం కావడంతో నీటిలో కరిగిపోయాడు. ఆ మట్టిలో తన భార్యను ఓ మొక్కను నాటినట్టు వివరించారు.  

హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తమ ఇంట్లోనే వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఇందుకు సంబంధించి ఆయన ఓ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. అంతేకాదు, అందుకు సంబంధించి ఓ వివరణ కూడా పెట్టారు.

వీడియోలో చూపిన విధంగా ఇంటిలోనే వినాయకుడిని నిమజ్జనం చేశానని సీవీ ఆనంద్ తెలిపారు. అనంతరంలో కుండీలోని నీటిలో వినాయకుడు కరిగిపోయాడు. ఆ కుండీలో మిగిలిన మట్టిలో తన భార్య ఓ మొక్కను నాటినట్టు వివరించారు. ఇలా చేయడం ద్వారా పర్యావరణానికి హానీ కలగకుండా నడుచుకోవడమే కాదు, మొక్కల సంఖ్యనూ పెంచినవారం అవుతామని తెలిపారు.

Also Read: గంగా జమున తెహజీబ్: గణపతి నిమజ్జనంలో భక్తులతోపాటు పోలీసుల స్టెప్పులు.. నగరంలో వెల్లివిరిసిన మతసామరస్యం (Videos)

ఈ సారి గణపతి నిమజ్జన ఊరేగింపుల్లో హైదరాబాద్‌లో పోలీసులు ఓ అడుగు ముందుకు వేసి హుషారుగా కాలు కదిపారు. భక్తులతోపాటు ఊరేగింపులో వారు కూడా భాగస్వామ్యం పంచుకున్నారు. భక్తులతో కలిసి స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్
చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?