హైదరాబాద్: యజమానికి మస్కా వేసిన డ్రైవర్.. రూ. 55 లక్షలు, కారుతో పరార్

Siva Kodati |  
Published : Sep 25, 2021, 09:58 PM ISTUpdated : Sep 25, 2021, 09:59 PM IST
హైదరాబాద్: యజమానికి మస్కా వేసిన డ్రైవర్.. రూ. 55 లక్షలు, కారుతో పరార్

సారాంశం

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో శనివారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి సంతోష్‌రెడ్డికి సొంత డ్రైవర్ షాకిచ్చాడు. రూ.55 లక్షలతో పాటు కారుతో సహా ఉడాయించాడు. కొద్దిసేపటి తర్వాత సంతోష్‌ ఫోన్‌ చేయగా శ్రీనివాస్‌ ఫోన్‌ స్విచాఫ్‌ అని వస్తోంది. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో శనివారం సాయంత్రం భారీ చోరీ జరిగింది. నగరానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి సంతోష్‌రెడ్డికి సొంత డ్రైవర్ షాకిచ్చాడు. మరో స్థిరాస్తి వ్యాపారికి ఇవ్వమని చెప్పి డ్రైవర్‌ శ్రీనివాస్‌కు రూ.55 లక్షలు ఇచ్చారు సంతోష్. కానీ శ్రీనివాస్‌ ఆ డబ్బు వ్యాపారికి ఇవ్వకుండా రూ.55 లక్షలతో పాటు కారుతో సహా ఉడాయించాడు. కొద్దిసేపటి తర్వాత సంతోష్‌ ఫోన్‌ చేయగా శ్రీనివాస్‌ ఫోన్‌ స్విచాఫ్‌ అని వస్తోంది. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్ కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Kavitha Comments: అలా చేస్తేనే మహిళలల రిజర్వేషన్ బిల్ వచ్చే ఆస్కారం | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లుపై BJP Bandaru Vijayalakshmi Reaction | Telangana | Asianet News Telugu