తన భార్యపై అనుమానంతో రఫీ అనే వ్యక్తి దుబాయ్ నుండి భార్య ఎవరెవరితో చాటింగ్ చేస్తోందో తెలుసుకొనేందుకు ఓ ప్రత్యేకమైన యాప్ను ఉపయోగించాడు.
హైదరాబాద్:తన భార్యపై అనుమానంతో రఫీ అనే వ్యక్తి దుబాయ్ నుండి భార్య ఎవరెవరితో చాటింగ్ చేస్తోందో తెలుసుకొనేందుకు ఓ ప్రత్యేకమైన యాప్ను ఉపయోగించాడు. ఈ యాప్ ద్వారా తన భార్య కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకొనేవాడు. దుబాయ్ నుండి వచ్చిన రఫీ బుధవారం నాడు సికింద్రాబాద్లోని ఓ లాడ్జీలో తన భార్యను హత్య చేశాడు.
జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన రఫీ సికింద్రాబాద్లోని లాలాగూడలోని రైల్వే క్వార్టర్స్కు చెందిన నఫీజ్ బేగం ప్రేమించుకొని పెళ్లి చేసుకొన్నారు. వీరిద్దరికీ పెళ్లైన నాలుగు రోజులకే రఫీ దుబాయ్ వెళ్లిపోయాడు. ఈ ఏడాది జనవరి మొదటి మాసంలో రఫీ దుబాయ్ నుండి భార్యకు చెప్పకుండానే లాలాగూడలోని ఇంటికి వచ్చాడు.
అయితే భార్య తలుపు తీసేందుకు ఆలస్యం చేసింది, దీంతో ఆయనకు అనుమానం వచ్చింది. సెల్ఫోన్లో తన భార్య ఎవరితోనో చాటింగ్ చేస్తోందని ఆయన గుర్తించాడు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి ఆయన దుబాయ్కు వెళ్లిపోయాడు. అయితే దుబాయ్కు వెళ్లే ముందు తన భార్య ఎవరెవరితో చాటింగ్ చేస్తోందనే విషయాలను తెలుసుకొనేందుకు గాను ఓ యాప్ను తన సెల్ఫోన్కు కనెక్ట్ చేసుకొన్నాడు.
తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొందని రఫీ అనుమానించాడు. భార్య కు చెప్పకుండానే ఈ నెల 12వ తేదీన సాయంత్రం లాలాగూడకు వచ్చాడు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకొన్నారు. అదే సమయంలో భార్యా భర్తలు గొడవ పెట్టుకొన్నారు.
ఆ తర్వాత రఫీ ఇంటి నుండి సికింద్రాబాద్ సమీపంలోని ఓ లాడ్జీలో దిగాడు. రాత్రి సమయంలో భార్య అతనికి పోన్ చేసింది. మాట్లాడాలని ఆమె అతణ్ణి కోరింది. లాడ్జీకి వచ్చిన భార్యను చున్నీతో రఫీ ఉరేసి చంపేశాడు.
ఆ తర్వాత తాను తన భార్యను చంపానని పోలీస్ కంట్రోల్ రూమ్కు కూడ ఫోన్ చేసి చెప్పాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రఫీ ఎందుకు దుబాయ్ నుండి ఆకస్మాత్తుగా వచ్చాడు, భార్యను ఎందుకు చంపాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.క్షణికావేశంలో ఈ హత్య జరిగిందా.. లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
అనుమానం: లాడ్జీలో భార్యను చంపేసి భర్త పరారీ