
నేటితో జిహెచ్ ఎంసి చేపట్టిన అన్నపూర్ణ భోజనం కోటి మంది అకలి తీర్చింది.
నాణ్యతలో రాజీ లేకుండా నిర్హహిస్తున్న ఈ పథకం ప్రజలనుంచి, రాజకీయ పార్టీలనుంచి బాగా ప్రశంసలందుకుంది.
ఈ పథకం ప్రారంభమయినప్పటినుంచి శనివారానికి కోటి మంది అన్నపూర్ణ భోజనం చేశారని అధికారులు చెప్పారు.
ఈ భోజనం అయిదు రుపాయల భోజనంగా ప్రజలలోప్రసిద్ధి చెందింది.
ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి కూడా ఇతర కాంగ్రెస్ నాయకులతో కలసి ఈ భోజనం తెప్పించుకుని తిని భేష్ అన్నారు.
అంధ్రప్రదేశ్ కు చెందిన మంగళగిరి వైఎస్ ఆర్ సి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి ఈ భోజనం స్వయంగా రుచి చూసి, మంగళగిరి నాలుగురుపాయలకే ఇలాంటిభోజనం ప్రవేశపెట్టారు.
మొదట్లో అయిుదు రుపాయల భోజనంగా ప్రారంభమయిన తర్వాత ఇది ‘అన్నపూర్ణ’గా మారింది.జంటనగరాలలో దదాపు 150 కేంద్రాలలో ఈ భోజనం అందిస్తున్నారు.
ఇదే స్ఫూర్తితో వరంగల్ వంటి ఇతర పట్టణాలలో కూడా ఈ భోజన శాలలు ఏర్పాటుచేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం యోచిస్తున్నది.