భార్య హత్యకు భర్త యత్నం: అందరూ చూస్తుండగానే పొదల్లోకి లాక్కెళ్లి..

Siva Kodati |  
Published : Mar 03, 2021, 06:56 PM ISTUpdated : Mar 03, 2021, 06:57 PM IST
భార్య హత్యకు భర్త యత్నం: అందరూ చూస్తుండగానే పొదల్లోకి లాక్కెళ్లి..

సారాంశం

ఖమ్మంలో దారుణం జరిగింది. భార్యను చంపేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. మోతెనగర్‌కు చెందిన దంపతులు నాగేశ్వరరావు, నవ్యల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఖమ్మంలో దారుణం జరిగింది. భార్యను చంపేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. మోతెనగర్‌కు చెందిన దంపతులు నాగేశ్వరరావు, నవ్యల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో పిల్లలను తీసుకుని భార్య నవ్య వెళ్లిపోతోంటే.. ఆమెపై రోడ్డుపైనే విరుచుకుపడ్డాడు భర్త నాగేశ్వరరావు. రోడ్డుపై నుంచి పక్కనే వున్న పొదల్లోకి లాక్కెళ్లి.. గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు.

దీంతో అప్రమత్తమైన స్థానికులు నాగేశ్వరరావుపై రాళ్లతో దాడి చేసి అతని బారి నుంచి ఆమెను విడిపించారు. గాయపడ్డ బాధితురాల్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Harish Rao on Revanth Reddy: పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం | Asianet News Telugu
హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?