భార్యను బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త

Published : Apr 04, 2019, 02:50 PM IST
భార్యను బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త

సారాంశం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తిపాకలో భార్యను భర్త క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తిపాకలో భార్యను భర్త క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వరంగల్ దేశాయిపేట ఎంహెచ్ నగర్‌కు సునీత, లంక రాములు 11 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. బుధవారం నాడు భార్య భర్తలు గొడవ పెట్టుకొన్నారు. 

ఈ సమయంలో ఆవేశానికి లోనైన రాములు భార్య సునీతను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు.  ఆ తర్వాత  అతను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.   ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu