భార్యను చంపి బకెట్‌లో కుక్కి.. రైలు కింద పడ్డ భర్త, సూసైడ్ నోట్‌తో వెలుగులోకి దారుణం

Siva Kodati |  
Published : Jun 28, 2022, 02:16 PM ISTUpdated : Jun 28, 2022, 02:21 PM IST
భార్యను చంపి బకెట్‌లో కుక్కి.. రైలు కింద పడ్డ భర్త, సూసైడ్ నోట్‌తో వెలుగులోకి దారుణం

సారాంశం

హైదరాబాద్ ఖైరతాబాద్ లో భార్యను చంపిన భర్త అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను పంపా, మహానంద్‌గా గుర్తించారు పోలీసులు. భర్త సూసైడ్ నోట్ కారణంగా దారుణం వెలుగులోకి వచ్చింది.   

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రేమ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. భార్య పంపాను హత్య చేసి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యను చంపి బకెట్ లో పెట్టాడు భర్త మహానంద్. అనంతరం నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి మహానంద్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా పంపా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan అంటే భయమా? | Janasena Leader Shankar Goud fire on Jagadeesh Reddy | Asianet News Telugu
Holidays : ఈ వీక్ లో ఇంకా ఒక్కటే వర్కింగ్ డే.. మిగతా వారమంతా సెలవులే.. నెక్ట్స్ మండే వరకు ఎంజాయ్