మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన ఉప సర్పంచ్..

Published : Jul 26, 2022, 10:26 AM IST
మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన ఉప సర్పంచ్..

సారాంశం

మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మరిపెడ మండలం పరిధిలో ఓ ప్రజాప్రతినిధి తన భార్యను గొడ్డలితో కిరాతకంగా హత్య చేశాడు. 

మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మరిపెడ మండలం పరిధిలో ఓ ప్రజాప్రతినిధి తన భార్యను గొడ్డలితో కిరాతకంగా హత్య చేశాడు. వివరాలు.. మరిపెడ మండలం పరిధిలోని ఆనకట్ట తండా ఉపసర్పంచ్ రవీందర్‌కు మమతతో దాదాపు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే ఈ రోజు తెల్లవారుజామున రవీందర్.. మమతపై దాడిచేసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

ఈ విషయం తెలుసుకున్న మమత బంధువులు.. పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు. రవీందర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు రవీందర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే భార్య మమతపై అనుమానం పెంచుకోవడంతోనే రవీందర్ ఈ ఘాతుకాని పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు రవీందర్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu