భవనంపై మనిషి పుర్రె, ఎముకలు: టెర్రాస్ గేటుకు లాక్

Published : Dec 30, 2020, 08:21 AM IST
భవనంపై మనిషి పుర్రె, ఎముకలు: టెర్రాస్ గేటుకు లాక్

సారాంశం

హైదరాబాదులోని ఎఎస్ రావు నగర్ షాకింగ్ విషయం బయటపడింది. బహుళ అంతస్థుల భవనంపైన మనిషి పుర్రె, కొన్ని ఎముకలు బయటపడ్డాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఓ భవనంపై దిగ్భ్రాంతికి గురిచేసే విషయం వెలుగు చూసింది. బహుళ అంతస్థుల కమర్షియల్ భవనంపైన మనిషి పుర్రె, కొన్ని ఎముకలు కనిపించాయి. ఈ సంఘటన హైదరాబాదులోని ఎఎస్ రావు నగర్ లో చోటు చేసుకుంది. 

కూలీలు చెత్తకుప్పలను ఎత్తిపోస్తుండగా ఎఎస్ రావు నగర్ లోని వోర్టెక్స్ భవనం టెర్రాస్ మీద మనిషి పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. భవనం నాలుగో అంతస్థులో ఓ జూనియర్ కాలేజీ ఉంది. విద్యార్థులు టెర్రాస్ మీదికి వెళ్లకుండా దానికి తాళం వేశారు. అది ఎప్పుడూ తాళం వేసే ఉంటుంది. 

చెత్తను ఎత్తిపోయడానికి, వాటర్ లీకేజీ సమస్యలను పరిష్కరించడానికి కూలీలను మంగళవారం టెర్రాస్ మీదికి పంపించారు. ఆ సమయంలో పుర్రె, ఎముకలు కనిపించాయి. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు కుషాయిగుడా ఇన్ స్పెక్టర్ ఎ మన్మోహన్ తెలిపారు. దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు 

PREV
click me!

Recommended Stories

Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video