భవనంపై మనిషి పుర్రె, ఎముకలు: టెర్రాస్ గేటుకు లాక్

Published : Dec 30, 2020, 08:21 AM IST
భవనంపై మనిషి పుర్రె, ఎముకలు: టెర్రాస్ గేటుకు లాక్

సారాంశం

హైదరాబాదులోని ఎఎస్ రావు నగర్ షాకింగ్ విషయం బయటపడింది. బహుళ అంతస్థుల భవనంపైన మనిషి పుర్రె, కొన్ని ఎముకలు బయటపడ్డాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఓ భవనంపై దిగ్భ్రాంతికి గురిచేసే విషయం వెలుగు చూసింది. బహుళ అంతస్థుల కమర్షియల్ భవనంపైన మనిషి పుర్రె, కొన్ని ఎముకలు కనిపించాయి. ఈ సంఘటన హైదరాబాదులోని ఎఎస్ రావు నగర్ లో చోటు చేసుకుంది. 

కూలీలు చెత్తకుప్పలను ఎత్తిపోస్తుండగా ఎఎస్ రావు నగర్ లోని వోర్టెక్స్ భవనం టెర్రాస్ మీద మనిషి పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. భవనం నాలుగో అంతస్థులో ఓ జూనియర్ కాలేజీ ఉంది. విద్యార్థులు టెర్రాస్ మీదికి వెళ్లకుండా దానికి తాళం వేశారు. అది ఎప్పుడూ తాళం వేసే ఉంటుంది. 

చెత్తను ఎత్తిపోయడానికి, వాటర్ లీకేజీ సమస్యలను పరిష్కరించడానికి కూలీలను మంగళవారం టెర్రాస్ మీదికి పంపించారు. ఆ సమయంలో పుర్రె, ఎముకలు కనిపించాయి. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు కుషాయిగుడా ఇన్ స్పెక్టర్ ఎ మన్మోహన్ తెలిపారు. దానిపై పోలీసులు కేసు నమోదు చేశారు 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్