కరీంనగర్: అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తికి కరోనా.. 33 మందికి పాజిటివ్

Siva Kodati |  
Published : Feb 19, 2021, 04:55 PM IST
కరీంనగర్: అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తికి కరోనా.. 33 మందికి పాజిటివ్

సారాంశం

దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పడిపోతున్న సంగతి తెలిసిందే. సామాజిక దూరం, మాస్క్ ధరించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంతో కోవిడ్ ఉద్ధృతి తగ్గింది.

దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పడిపోతున్న సంగతి తెలిసిందే. సామాజిక దూరం, మాస్క్ ధరించడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంతో కోవిడ్ ఉద్ధృతి తగ్గింది.

ఈ క్రమంలో కరీంనగర్‌ నగర శివారు చేగుర్తిలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావడం అధికారులను ఆందోళన కలిగిస్తోంది. 10 రోజుల క్రితం ఓ వ్యక్తి అనారోగ్యంతోనే చనిపోయాడని భావించిన గ్రామస్థులు.. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

అందులో పాల్గొన్న వారిలో ఒకరికి కోవిడ్ నిర్ధారణ కావడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. రంగంలోకి దిగిన అధికారులు చేగుర్తిలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేసి నమూనాలను సేకరించారు.   

Also Read:తెలంగాణ : కొత్తగా 165 కరోనా కేసులు

నిన్న 45 మంది నమూనాలు పరీక్షించగా 16 మందికి, ఈరోజు మరో 17 మంది కలిపి మొత్తం 33 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. బాధితులను హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు చెప్పారు.

మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల్లోనూ వైద్యశిబిరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దేశంలో కరోనా ప్రవేశించిన తొలి నాళ్లలో కరీంనగర్‌లో ఇదే స్థాయిలో కేసులు బయటపడటంతో ప్రభుత్వం వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. 
 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu