Honour killing: రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District)లో దారుణం జరిగింది. జిల్లాలోని కేశంపేట మండలం నిర్దవెల్లిలో పరువు హత్య కలకలం రేపుతోంది. తన కూతురుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే ఆగ్రహంతో ఓ యువకుడ్ని యువతి తండ్రి, అతని బంధువులు, స్నేహితులు అత్యంత దారుణంగా కొట్టి చంపారు. ఆ హత్య బయటకు రాకుండా ఆ శవాన్ని పాతిపెట్టారు. బాధితుడి అన్న ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు స్థానికులతో సహా ఐదుగుర్ని నిందితులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన రంజిత్కుమార్, సంతోష్కుమార్తో పాటు బాధితుడు కరణ్కుమార్ చెందిన కుటుంబాలు బతుకు దెరువు కోసం రంగారెడ్డి జిల్లాకు వచ్చారు. ఈ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కరణ్ కుమార్ రంజిత్ కూతురితో ప్రేమ వ్యవహరం సాగించాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి రంజిత్ తీవ్రంగా వ్యతిరేకించాడు. తన కూతురుకి దూరంగా ఉండమని కరణ్ని మందలించాడు. దీంతో కేశంపేటలో పనిచేసే కరణ్ సిద్దిపేటకు వెళ్లి అక్కడ పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబం నుండి అభ్యంతరాలు ఉన్నప్పటికీ కరణ్ .. రంజిత్ కుమార్తెను మరిచిపోలేకపోయాడు. ఎవరికి తెలియకుండా వారిద్దరూ కలవడం చేస్తున్నారు. ఈ విషయం కూడా రంజిత్ కు తెలిసింది.
ఆ విషయం తెలుసుకున్న ఆ యువతి తండ్రి రంజిత్ .. నలుగురు బంధువులు సమస్యను చర్చించి, వారి వివాహం నిశ్చయించుకునే నెపంతో కరణ్ ను పిలిపించారు. ఎన్నో ఆశలతో వచ్చిన కరణ్ ను నమ్మించి దొంగ దెబ్బతీశారు. ఆ యువకుడిపై విచక్షణరహితంగా దాడి చేసి హతమార్చారు. ఈ విషయం బయటకు రాకుండా.. అక్కడే మృతదేహాన్ని పూడ్చిపెట్టారని కేశంపేట పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ బీఎస్ఎస్ వరప్రసాద్ తెలిపారు. కరణ్ను హత్య చేసిన అనంతరం నిందితులు వారి కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం (బీహార్) వెళ్లిపోయారు.
తన తోబుట్టువు తప్పిపోయినట్లు గుర్తించిన కరణ్ సోదరుడు దిలీప్ అతని కోసం వెతకడం ప్రారంభించాడు. కానీ తన సోదరుడు ఆచూకీ లభించకపోవడంతో దిలీప్ తిరిగి కేశంపేటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. అతని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఒక ప్రత్యేక బృందం బాధితుడి మృతదేహాన్ని గుర్తించింది. చివరకు అనుమానితుల్లో ఒకరిని ప్రశ్నంచగా హత్య వెలుగులోకి వచ్చింది. పొలం నుండి మృతదేహాన్ని వెలికితీసినట్టు సబ్ ఇన్స్పెక్టర్ చెప్పారు.
హత్య వెనుక ఉద్దేశం ఏమిటంటే..
కరణ్కి తన అమ్మాయికి దగ్గరి సంబంధం ఉంది. వ్యక్తి తన కుమార్తెను వివాహం చేసుకుంటే అతని కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని, అతని చిన్న కుమార్తెలకు కూడా సమస్యలు తలెత్తుతాయని రంజిత్ భావించాడని పోలీసులు తెలిపారు. మొత్తం ఐదుగురిని రిమాండ్కు తరలించారు.