తెలంగాణలో మరో పరువు హత్య : యువకుడి తండ్రిని చంపిన అమ్మాయి కుటుంబం

By Siva KodatiFirst Published Oct 30, 2020, 6:06 PM IST
Highlights

మిర్యాలగూడ ప్రణయ్.. హైదరాబాద్ హేమంత్ తెలంగాణలో వరుసగా పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కూతురు తమకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందానే అక్కసుతో అబ్బాయి తండ్రిని అమ్మాయి బంధువులు దారుణంగా హత్య చేశారు.

మిర్యాలగూడ ప్రణయ్.. హైదరాబాద్ హేమంత్ తెలంగాణలో వరుసగా పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కూతురు తమకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందానే అక్కసుతో అబ్బాయి తండ్రిని అమ్మాయి బంధువులు దారుణంగా హత్య చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలం స్తంభంపల్లిలో గౌతమి- మహేశ్ అనే ఓ ప్రేమ జంట వివాహం చేసుకుంది. ఇది తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు మహేశ్ ఇంటిపై దాడి చేశారు.

ఆగ్రహంతో ఊగిపోతూ అబ్బాయి తండ్రిని చితకబాదారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన అతను మరణించాడు. గౌతమి- మహేశ్‌లు దసరా రోజున పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అదే రోజున అబ్బాయి తండ్రిని గౌతమి కుటుంబసభ్యులు కొట్టారు. తీవ్రగాయాల పాలైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 
 

click me!