- హోలీ పండగ వేళ నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం
బావ ను ఆటపట్టించాలనుకున్న ఓ మరదలు సరసం చివరికే అతని ప్రాణాన్నే తీసింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని దేవుడితండా లో ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్ లోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ లో మూడో సంవత్సరం చదువుతున్న చందునాయక్ హోలీ పండగ నేపథ్యంలో సొంతూరికి వెళ్లాడు.
ఇంటి వద్ద ఉండగా మరదలు వరసయ్యే యువతి అతడిపై రంగునీళ్లు అనుకొని టార్పెంటాయిల్ చల్లింది.
అయితే ఆ సమయంలో చందు కట్టలపొయ్యే పక్కనే ఉండటంతో టార్పెంటాయిల్ అతడిపై నే కాకుండా పొయ్యిలో కూడా పడి భారీగా మంటలు చెలరేగాయి.
ఈ మంటలు చందును కూడా అంటుకున్నాయి. దీంతో అతడు సమీపంలో ఉన్న నీటి డ్రమ్ములో దూకాడు. బంధువులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించాడు.
డాక్టర్లు చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది. తీవ్ర గాయాలతో చికిత్సపొందుతున్న చందు గురువారం మృతి చెందాడు.