తెలంగాణ‌లో విద్యాసంస్థలకు సెలవులు పొడగింపు.. అధికారికంగా ప్రకటించిన సీఎస్.. ఎప్పటివరకంటే..?

Published : Jan 16, 2022, 09:29 AM ISTUpdated : Jan 16, 2022, 09:42 AM IST
తెలంగాణ‌లో విద్యాసంస్థలకు సెలవులు పొడగింపు.. అధికారికంగా ప్రకటించిన సీఎస్.. ఎప్పటివరకంటే..?

సారాంశం

తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులను పొడగించారు. కరోనా దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులను పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.

తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులను పొడగించారు. కరోనా దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులను పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. విద్యాసంస్థలకు సెలవులను ఈ నెల 30 వరకు పొడగించింది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ అధికారికంగా ప్రకటన చేశారు. 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. జనవరి 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. ఇందులో సంక్రాంతి సెలవులు (Sankranti holidays) కూడా కలిసివచ్చాయి. ఈ సెలవులు నేటితో ముగియనున్నాయి. అయితే కరోనా కేసులు మాత్రం రోజురోజుకు పెరగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెలవులను పొడగించనుందనే కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 30 వరకు సెలవులను పొడగిస్తూ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వింగ్స్ ఇండియా 2026 అవార్డుల వేడుకలో Civil Aviation Minister Rammohan Naidu | Asianet News Telugu
Minister Rammohan Naidu Speech | Wings India 2026 Awards Ceremony in Hyderabad | Asianet News Telugu