నోట్ల రద్దుపై కేసు

Published : Nov 08, 2016, 10:02 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
నోట్ల రద్దుపై కేసు

సారాంశం

హైకోర్టులో అడ్వొకేట్ పివి కృష్ణయ్య పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అడ్వొకేట్ పీవీ కృష్ణయ్య బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం నిర్ణయం వల్ల దేశంలో ఆర్థిక అనిశ్చితి పెరిగిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

తగినంత చిల్లర నోట్లను మార్కెట్లో అందుబాటులో ఉంచకుండానే నోట్ల రద్దును తెరపైకి తెచ్చారని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు. ఆర్బీఐ నిబంధనలను పట్టించుకోకుండా నోట్లను రద్దు చేశారని పిటిషన్ లో కృష్ణయ్య కోర్టుకు తెలిపారు. కాగా, ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది.

PREV
click me!

Recommended Stories

iBomma Ravi : అసలు ఐబొమ్మ నాది అని చెప్పింది ఎవడు..? ఫస్ట్ టైమ్ నోరువిప్పిన రవి !
Bandi Sanjay About Akhanda 2: బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్ ని చూసా: బండి సంజయ్ | Asianet News Telugu