యువతి మృతిపై వివాదం.. యువకుడి ఇంటిపై గ్రామస్తుల దాడి, కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Jul 17, 2022, 04:53 PM IST
యువతి మృతిపై వివాదం.. యువకుడి ఇంటిపై గ్రామస్తుల దాడి, కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత

సారాంశం

యువతి మరణానికి గ్రామానికి చెందిన యువకుడే కారణమంటూ కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేటలో అతని ఇంటిపై బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు దాడికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. 

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేటలో ఆదివారం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఓ యువతి మరణానికి సంబంధించి గ్రామంలో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన యువకుడే కారణమంటూ అతని ఇంటిపై మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు దాడికి దిగారు. యువకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లకుండా పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో లాఠీఛార్జీ చేసి గ్రామస్తులను చెదరగొట్టారు పోలీసులు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu