ఇంటి స్థలం , లోన్లు ఇస్తామంటూ మోసం : భగ్గుమన్న మహిళలు.. మహాభారత్ పార్టీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Sep 20, 2023, 02:16 PM IST
ఇంటి స్థలం , లోన్లు ఇస్తామంటూ మోసం : భగ్గుమన్న మహిళలు.. మహాభారత్ పార్టీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

సారాంశం

హైదరాబాద్‌లో రవీంద్రభారతి దగ్గర జై మహా భారత్ పార్టీ ఆఫీసులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జై మహాభారత్ పార్టీ నిర్వాహకులు. ఒక్కొక్కరికి 200 గజాల ల్యాండ్ ఇస్తానని లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్‌లో రవీంద్రభారతి దగ్గర జై మహా భారత్ పార్టీ ఆఫీసులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ల్యాండ్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారు జై మహాభారత్ పార్టీ నిర్వాహకులు. ఒక్కొక్కరికి 200 గజాల ల్యాండ్ ఇస్తానని లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. తాము మోసపోయినట్లు గ్రహించిన బాధిత మహిళలు భారీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంత విష్ణును నిలదీశారు మహిళలు. తమకు భూమి, లోన్లు ఇస్తామని మోసం చేశారని మహిళలు ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !