గోపన్‌పల్లి భూములపై చట్ట ప్రకారంగానే వ్యవహరించాలి: రేవంత్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు

Published : Mar 06, 2020, 02:26 PM ISTUpdated : Mar 06, 2020, 03:06 PM IST
గోపన్‌పల్లి భూములపై చట్ట ప్రకారంగానే వ్యవహరించాలి: రేవంత్ రెడ్డి పిటిషన్‌పై  హైకోర్టు

సారాంశం

గోపన్ పల్లి భూముల విషయంలో చట్ట ప్రకారంగానే వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.   

హైదరాబాద్: గోపన్ పల్లి భూముల విషయంలో చట్ట ప్రకారంగానే వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. 

గోపన్‌పల్లి భూముల వ్యవహరంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నాడు  హైకోర్టు విచారణ చేసింది. గురువారం నాడు ఈ భూముల విషయమై హైకోర్టులో రేవంత్ రెడ్డి తో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Also read:గోపన్‌పల్లి భూములు: హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి

ఈ పిటిషన్‌పై  శుక్రవారం నాడు హైకోర్టు విచారణ చేసింది. ఈ భూముల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని హైకోర్టుకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని  హైకోర్టు సూచించింది.

మరో వైపు తమకు ఎలాంటి నోటీసులు కూడ ఇవ్వలేదని ఏపీ హైకోర్టుకు రేవంత్ తరపున న్యాయవాది గుర్తు చేశారు. అయితే ఈ విషయమై ప్రభుత్వ తరపున న్యాయవాది జోక్యం చేసుకొని  ఏ చర్యలు తీసుకొన్నా కూడ  ముందుగా రేవంత్ రెడ్డి సోదరులకు నోటీసులు ఇస్తామని  ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు.ఈ కేసు విచారణను హైకోర్టు ముగించింది. 

PREV
click me!

Recommended Stories

Viral Video: ఇది చ‌దువుకున్న వాళ్లు చేసే ప‌నేనా.. రోడ్ల‌పై క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు చించి ప‌డేయం ఏంటి.?
IMD Rain Alert: వ‌చ్చే రెండు రోజులు భారీ వ‌ర్షాలు.. ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ