కమ్మ, వెలమ సంఘ భవనాల నిర్మాణానికి భూ కేటాయింపులు: తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

Siva Kodati |  
Published : Aug 18, 2021, 06:58 PM IST
కమ్మ, వెలమ సంఘ భవనాల నిర్మాణానికి భూ కేటాయింపులు: తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

సారాంశం

కమ్మ, వెలమ సంఘ భవనాల నిర్మాణానికి భూ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.  ఖానామెట్‌లో కమ్మ, వెలమలకు ఐదెకరాల చొప్పున భూమిని ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. జీవో నెంబ 47ని కొట్టివేయాలని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వాదించారు. 

కమ్మ, వెలమ సంఘ భవనాల నిర్మాణానికి భూ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వినాయక్ రెడ్డి పిల్‌పై సీజే హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఖానామెట్‌లో కమ్మ, వెలమలకు ఐదెకరాల చొప్పున భూమిని ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. జీవో నెంబ 47ని కొట్టివేయాలని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వాదించారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న హైకోర్టు.. వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను వచ్చే నెల 28కి వాయిదా వేసింది. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu