సోలార్ ప్యానల్ మెటీరియల్ సప్లై చేస్తానని భారీ మోసం.. హైదరాబాద్‌ కంపెనీకి రూ. 8.7 కోట్ల టోకరా!

Published : Jul 23, 2022, 12:27 PM IST
సోలార్ ప్యానల్ మెటీరియల్ సప్లై చేస్తానని భారీ మోసం.. హైదరాబాద్‌ కంపెనీకి రూ. 8.7 కోట్ల టోకరా!

సారాంశం

సోలార్ ప్యానల్ మెటీరియల్ సప్లై చేస్తానని నమ్మించి మోసం చేసిన ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని గుజరాత్‌కు చెందిన ఐలేష్ షాగా గుర్తించారు.

సోలార్ ప్యానల్ మెటీరియల్ సప్లై చేస్తానని నమ్మించి మోసం చేసిన ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని గుజరాత్‌కు చెందిన ఐలేష్ షాగా గుర్తించారు. వివరాలు.. ఐలేష్ గుజరాత్‌లోని సూరత్‌లో సోలార్ ప్యానల్ కంపెనీ నడుపుతున్నాడు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీకి 5,580 సోలార్ మాడ్యుల్స్ సరఫరా చేస్తానని ఐలేష్ నమ్మించాడు. ఐలేష్ సోలార్ కంపెనీ నడుపుతుండటంతో నమ్మకంతో సోలార్ మాడ్యుల్స్ కోసం.. ఆ కంపెనీ రూ. 8.7 కోట్లను అతని బదిలీ చేసింది. అయితే ఈ డబ్బును ఐలేష్ తన బినామీ ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. 

అయితే ఐలేష్ చెప్పినట్టుగా సోలార్ మాడ్యుల్స్ సరఫరా చేయకపోవడంతో బాధితులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడు ఐలేష్‌ను ముంబైలో అరెస్ట్ చేశారు. అనంతరం ఐలేష్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి రూ. 38 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అతని బినామీ ఖాతాలను పోలీసులు సీజ్ చేయించారు. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే