పంచాయతీరాజ్ క్లర్క్ పరీక్షా పేపర్ లీక్.. ఐడీఏ బొల్లారంలో గుజరాత్ ఏటీఎస్ సోదాలు

By Siva KodatiFirst Published Jan 29, 2023, 6:15 PM IST
Highlights

గుజరాత్ పంచాయతీ రాజ్ శాఖ జూనియర్ క్లర్క్ పరీక్షకు సంబంధించిన పరీక్షా పత్రం లీకైన వ్యవహారం జాతీయ స్థాయిలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గుజరాత్ ఏటీఎస్ పోలీసులు తెలుగు రాష్ట్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

గుజరాత్ పంచాయతీ రాజ్ శాఖ జూనియర్ క్లర్క్ పరీక్షకు సంబంధించి ఆ రాష్ట్ర ఏటీఎస్ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఐడీఏ బొల్లారం కేఎల్ ప్రింటింగ్ ప్రెస్‌లో గుజరాత్ ఏటీఎస్ తనిఖీలు చేపట్టింది. గుజరాత్ పంచాయతీరాజ్ పరీక్ష పేపర్‌ను కేఎల్ ప్రింటింగ్ ప్రెస్‌లోనే ముద్రించారు. ఒడిషాకు చెందిన జీతు నాయక్‌తో కలిసి సర్దాకర్ రోహా పేపర్ లీక్ చేశారు. కేఎల్ ప్రింటింగ్ ప్రెస్‌లో సర్దార్ రోహా ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. 

పంచాయతీరాజ్ శాఖకు చెందిన పరీక్షా పేపర్ రెండు గంటలకు ముందే ఇక్కడ లీక్ అయ్యింది. దీంతో పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో పరీక్ష పేపర్లు ప్రింటైనట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి గుజరాత్ ఏటీఎస్ పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు ఇవాళ  పరీక్షను రద్దు చేయడంతో  అభ్యర్ధులు  ఆందోళనలు నిర్వహించారు.

ALso Read: గుజరాత్ పేపర్ హైదరాబాద్‌లో లీక్ .. తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల సోదాలు, 15 మంది అరెస్ట్

అయితే పరీక్షలు ఎప్పుడు నిర్వహించనున్నామో త్వరలోనే  ప్రకటించనున్నట్టుగా  జీపీఎస్ఎస్‌ఈబీ ప్రకటించింది. 1150 జూనియర్ క్లర్క్  పోస్టుల కోసం  తొమ్మిది లక్షల మంది అభ్యర్ధులు  ధరఖాస్తు  చేసుకున్నారు. అయితే రాష్ట్రంలో 12 ఏళ్లలో  ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా  రద్దు చేసిన  15వ పోటీ పరీక్షగా  కాంగ్రెస్ విమర్శించింది.  ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన నిందితులపై  చర్యలు తీసుకొంటే  ఈ తరహా ఘటనలు పునరావృతం కావని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషీ చెప్పారు.
 

click me!