జీఎస్టీ కట్టలేదని షాప్ సీజ్‌ చేయడానికి వెళ్తుండగా.. ప్రభుత్వాధికారి కిడ్నాప్, దుకాణ యజమానే నిందితుడు

Siva Kodati |  
Published : Jul 05, 2023, 02:27 PM IST
జీఎస్టీ కట్టలేదని షాప్ సీజ్‌ చేయడానికి వెళ్తుండగా.. ప్రభుత్వాధికారి కిడ్నాప్, దుకాణ యజమానే నిందితుడు

సారాంశం

సరూర్‌నగర్ సీనియర్ జీఎస్టీ ఆఫీసర్ మణిశర్మ కిడ్నాప్‌కు గురయ్యారు.  సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్లను వెంబడించి మణిశర్మను కాపాడారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఓ షాప్ యాజమానే ఆయనను అపహరించాడు. 

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. సరూర్‌నగర్ సీనియర్ జీఎస్టీ ఆఫీసర్ మణిశర్మ కిడ్నాప్‌కు గురయ్యారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జీఎస్టీ కట్టని ఓ షాప్‌ను సీజ్ చేసేందుకు బుధవారం బయల్దేరారు మణిశర్మ. అయితే సదరు షాప్ యజమాని, మరో ముగ్గురు కలిసి మణిశర్మను కిడ్నాప్ చేసి ఆయనపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్లను వెంబడించి మణిశర్మను కాపాడారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు | Weather Update| Asianet News Telugu
Ramzan Holidays : ఈ శుక్రవారమా లేక శనివారమా..? తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ సెలవు ఎప్పుడు..?