నాంపల్లి కోర్టు సంచలన తీర్పు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు జైలు శిక్ష

Siva Kodati |  
Published : Jan 29, 2021, 04:38 PM ISTUpdated : Jan 29, 2021, 04:39 PM IST
నాంపల్లి కోర్టు సంచలన తీర్పు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు జైలు శిక్ష

సారాంశం

బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. బొల్లారం దాడి కేసులో ఆయనకు ఏడాది శిక్ష విధిస్తూ నాంపల్లి సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 

బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. బొల్లారం దాడి కేసులో ఆయనకు ఏడాది శిక్ష విధిస్తూ నాంపల్లి సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 

పోలీసులపై దాడి దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణపై రాజాసింగ్ మీద 2015లో కేసు నమోదైంది. రాజాసింగ్ బీఫ్ ఫెస్టివల్ ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనను అరెస్టు చేశారు కూడా. ఈ సందర్భంగా జరిగిన వాగ్వివాదంలో రాజాసింగ్ సీఐని దూషించారంటూ కేసు నమోదైంది. 

అంతకు ముందు కూడా రాజాసింగ్ మీద కేసు నమోదైంది. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మీద దాడిచేయడమే కాకుండా చంపేస్తానంటూ కూడా బెదిరించారు. దీంతో బాధిత కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.

 

PREV
click me!

Recommended Stories

Weather Report: ఇంకా రెండో రోజులే.. ఏప్రిల్ 10 త‌ర్వాత చుక్క‌లు ఖాయం. హెచ్చ‌రిస్తోన్న వాతావార‌ణ శాఖ
Real Estate : హైదరాబాద్‌లో మరో హైటెక్ సిటీ.. లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం !