గొల్కొండ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు.. ప్రయాణికులు క్షేమం

By sivanagaprasad kodatiFirst Published Sep 24, 2018, 6:43 PM IST
Highlights

సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే గొల్కొండ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్ వెనుక బోగీకి సంబంధించిన బ్రేక్ రాడ్డు ఊడిపోయింది. అయినప్పటికీ రైలు కిలోమీటర్ దూరం ముందుకు వెళ్లిపోయింది. 

సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే గొల్కొండ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్ వెనుక బోగీకి సంబంధించిన బ్రేక్ రాడ్డు ఊడిపోయింది. అయినప్పటికీ రైలు కిలోమీటర్ దూరం ముందుకు వెళ్లిపోయింది.

దీనిని వెంటనే పసిగట్టిన డ్రైవర్ రైలును కేసముద్రం వద్ద నిలిపివేశాడు.. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు, సిబ్బంది సమస్యను సరిచేశారు. పెను ప్రమాదం తప్పినందుకు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

click me!