ప్రేమించాలంటూ 8మంది బెదిరింపులు:తాళలేక యువతి ఆత్మహత్య

By Nagaraju TFirst Published Oct 21, 2018, 5:16 PM IST
Highlights

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. తిరుమలగిరికి చెందిన ఓ యువతిని 8మంది యువకులు ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. తమను ప్రేమించాలంటూ నిత్యం వెంటపడుతున్నారు. పోకిరీల వేధింపులు తట్టుకోలేక ఆ యువతి నరకం అనుభవిస్తోంది. తల్లిదండ్రులకు చెప్పుకోలేక లోలోన మనోవేదనకు గురైంది. 

హైదరాబాద్:హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. తిరుమలగిరికి చెందిన ఓ యువతిని 8మంది యువకులు ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. తమను ప్రేమించాలంటూ నిత్యం వెంటపడుతున్నారు. పోకిరీల వేధింపులు తట్టుకోలేక ఆ యువతి నరకం అనుభవిస్తోంది. తల్లిదండ్రులకు చెప్పుకోలేక లోలోన మనోవేదనకు గురైంది. 

అయితే పోకిరీల ఆగడాలు రోజురోజుకు శృతిమించాయి. ప్రేమించకపోతే తల్లిదండ్రులను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో పోకిరీల వేధింపులను తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. 

click me!