జీహెచ్ఎంసీ ఎన్నికలు: కూన శ్రీశైలం గౌడ్‌పై లాఠీఛార్జీ.. ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Nov 21, 2020, 4:14 PM IST
Highlights

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గాజులరామారం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌పై లాఠీచార్జ్‌ జరిగింది. 

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గాజులరామారం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌పై లాఠీచార్జ్‌ జరిగింది. నామినేషన్‌ పరిశీలనలో భాగంగా కుట్రపూరితంగా డిస్‌క్వాలిఫై చేస్తున్నారంటూ రిటర్నింగ్‌ కార్యాలయం వద్ద శ్రీశైలం​ గౌడ్‌ ఆందోళనకు దిగారు.

టీఆర్‌ఎస్‌ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. అభ్యర్థి అడ్వకేట్‌ను కూడా అధికారులు అనుమతించడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

click me!