జీహెచ్ ఎంసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కూకట్ పల్లి ఫోరమ్ మాల్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారుపై దాడి జరిగింది. పోలింగ్ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
జీహెచ్ ఎంసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కూకట్ పల్లి ఫోరమ్ మాల్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారుపై దాడి జరిగింది. పోలింగ్ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కూకట్ పల్లి ఫోరమ్ మాల్ దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కారులో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఆయన కారుపై దాడి చేశారు.
ఓ టీఆర్ఎస్ కార్యకర్త మీద బీజేపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మంత్రి కాన్వాయ్ ను వెంబడించి కారు అద్దాలు ధ్వంసం చేశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు భాజాపా కార్యకర్తలను చెదరగొట్టారు.