Gali Janardhan Reddy కి హైకోర్టులో ఊరట: సీబీఐ తీర్పును సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు..

Published : Jun 11, 2025, 11:12 AM IST
Gali Janardhan Reddy

సారాంశం

ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్టు స‌రెండ‌ర్ చేయాలని ఆదేశించింది.

కర్ణాటక రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో తెలంగాణ హైకోర్టులో తాత్కాలికంగా ఊరట పొందారు. సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల ఆయనకు విధించిన ఏడేళ్ల జైలుశిక్షను హైకోర్టు ఈ దశలో అమలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ పరిణామంతో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది.

గత నెల 6న ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి అక్రమ రీతిలో మైనింగ్ నిర్వహించిన కేసులో సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆ తీర్పులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, వీడీ రాజగోపాల్, అలీఖాన్‌ లను కూడా దోషులుగా నిర్దిష్టం చేసి ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పుపై అసంతృప్తితో ఉన్న జనార్థన్ రెడ్డి ఇతర నిందితులతోపాటు ఓఎంసీ సంస్థ కూడా హైకోర్టును ఆశ్రయించింది.

బెయిల్ మంజూరు…

ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం వాదనలు చేపట్టి, విచారణ ముగించిన తర్వాత బుధవారం తీర్పును వెలువరిస్తామని ప్రకటించింది. ఆ ప్రకారంగా న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ తాజాగా తీర్పు ఇచ్చారు. ఈ తీర్పులో హైకోర్టు, సీబీఐ కోర్టు తీర్పును తాత్కాలికంగా నిలిపివేస్తూ, గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.

అయితే, హైకోర్టు కొన్ని షరతులు విధించింది. దేశం వదిలి వెళ్లకూడదని, పాస్‌పోర్టును కోర్టులో సమర్పించాలని స్పష్టం చేసింది. తద్వారా విచారణ పూర్తయ్యేంతవరకూ న్యాయస్థానానికి అందుబాటులో ఉండాలని సూచించింది.

ఈ కేసు దేశవ్యాప్తంగా భారీ దృష్టిని ఆకర్షించినదే. వందల కోట్ల రూపాయల విలువైన ఖనిజాలు అక్రమంగా తవ్వినట్టుగా ఆరోపణలు ఉన్న ఈ కేసు, అనేక సంవత్సరాలుగా న్యాయస్థానాల్లో సాగుతూ వస్తోంది. తాజాగా హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పు ఈ కేసులో కీలక మలుపుగా కనిపిస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Report: గ‌జ‌గ‌జ వ‌ణ‌కాల్సిందే, మ‌రింత పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌.. పూర్తిగా త‌గ్గేది ఎప్పుడంటే?
KTR Comments: "లంగా మాటలు దొంగ మాటలు "రేవంత్ రెడ్డి పై కేటిఆర్ పంచ్ లు| Asianet News Telugu