నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

Published : Dec 09, 2020, 01:00 PM ISTUpdated : Dec 09, 2020, 02:08 PM IST
నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

సారాంశం

 నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం గుడిగండ్ల వద్ద బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.  

మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం గుడిగండ్ల వద్ద బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

గుడిగండ్ల వద్ద  కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. అతి వేగంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.గుడిగండ్ల వద్ద కారు బోల్తా పడింది. వేగం అదుపు కాకపోవడంతో  కారు బోల్తాపడింది. కారులోని నలుగురు మరణించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

హైద్రాబాద్ లోని బండ్లగూడకు చెందిన ఓ కుటుంబం కర్ణాటకలోని రాయిచూర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

రాయిచూర్ లోని ఓ ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. గుడిగండ్ల వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపు వద్ద  కారు అదుపుతప్పి బోల్తాపడింది.  ఈ ప్రమాదంలో  ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి, కారు డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu