కేసీఆర్‌కు బిగ్ షాక్: బీజేపీలో చేరిన స్వామి గౌడ్

Siva Kodati |  
Published : Nov 25, 2020, 05:56 PM ISTUpdated : Nov 25, 2020, 05:57 PM IST
కేసీఆర్‌కు బిగ్ షాక్: బీజేపీలో చేరిన స్వామి గౌడ్

సారాంశం

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. తెలంగాణ శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ బీజేపీ గూటికి చేరారు. బుధవారం భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. తెలంగాణ శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ బీజేపీ గూటికి చేరారు.

బుధవారం భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే హైదరాబాద్‌లో స్వామిగౌడ్‌తో బీజేపీ నేతలు సమావేశమవడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.

ఉద్యోగ సంఘాల నేతగా, తెలంగాణ ఉద్యమనేత స్వామిగౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. దీంతో ఆయనకు శాసనమండలి ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. 
 

PREV
click me!

Recommended Stories

KCR: కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీట్.. హాట్ కామెంట్స్ తో రచ్చ
KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu