రామోజీ రావు కోడలిపై తెలంగాణలో కేసు

Published : Jan 25, 2018, 03:59 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
రామోజీ రావు కోడలిపై తెలంగాణలో కేసు

సారాంశం

నాంపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నాంపల్లి కోర్టులో ప్రయివేటు పిటిషన్ వేసిన సంగీత అనే మహిళ శైలజా కిరణ్ తో పాటు మార్గదర్శి సంస్థ అధికారులపైనా కేసులు

ప్రముఖ వ్యాపార వేత్త, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కోడలు శైలజా కిరణ్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఆమె ప్రస్తుతం మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

చిట్ ఫండ్ సిబ్బంది గ్యారెంటరైనా సంగీత సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇల్లిగల్ అటాచ్ మెంట్  చేశారని నాంపల్లి కోర్టు లో ప్రయివేటు ఫిర్యాదు ధాఖలు అయింది. సంగీత అనే వ్యక్తి ఈ పిటిషన్ ప్రయివేటు కేసు వేశారు.

దీంతో ఆమె పిటిషన్ ను పరిశిలించిన నాంపల్లి కోర్టు తక్షణమే శైలజా కిరణ్ మీద కేసు నమోదు చేయాలని నాంపల్లి పోలీసులను ఆదేశించింది. దీంతో శైలజా కిరణ్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. అయింది.

కోర్ట్ ఆదేశాల మేరకు  మార్గదర్శి చిట్ ఫండ్ ఎండి శైలజ కిరణ్ తో పాటు తిరుమలగిరి బ్రాంచ్  మేనేజర్ పార్ధ సారధి, సంపత్, చిట్ ఫండ్ కంపెనీ పై కేసు నమోదు చేశారు నాంపల్లి పోలీసులు.

వీరందరిపై ఐపిసి 420, 468, 471, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నాంపల్లి పోలీసులు.

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert: వచ్చే 3 రోజులు ఆ జిల్లాల వాళ్ళు అస్సలు బయటకు రావొద్దు.. భారీ వర్షాలు !
Ameerpet Fire: అమీర్‌పేటలో అగ్ని ప్రమాదంఅసలు కారణాలు ఇవే వెల్లడించిన అధికారులు| Asianet News Telugu