నిజామాబాద్ : గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టిన కారు, ఐదుగురికి గాయాలు.. వీడియో వైరల్

Siva Kodati |  
Published : Oct 27, 2022, 03:19 PM IST
నిజామాబాద్ : గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టిన కారు, ఐదుగురికి గాయాలు.. వీడియో వైరల్

సారాంశం

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఆంధ్ర నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం స్కూల్‌కు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై ధాన్యం కుప్పలను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. 

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఆంధ్ర నగర్‌లో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు టీచర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఐలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఉదయం స్కూల్‌కు వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై ధాన్యం కుప్పలను ఢీకొట్టింది. ఈ వేగానికి పల్టీలు కొట్టి బోల్తా కొట్టింది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు కారులో చిక్కుకుపోయిన టీచర్లను బయటకి తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu