పెద్దపల్లి సుల్తానాబాద్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ను ఢీకొన్న కారు: ఐదుగురికి గాయాలు

By narsimha lodeFirst Published Jul 28, 2023, 10:00 AM IST
Highlights

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ బస్టాండ్ వద్ద ఇవాళ  ప్రమాదం  జరిగింది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను  కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో  గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ బస్టాండ్ సమీపంలో  ట్రాన్స్ ఫార్మర్ ను కారు ఢీకొంది.  ఈ సమయంలో కారులో  ఐదుగురు ప్రయాణీస్తున్నారు. ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొన్న తర్వాత  కారులోని  నుండి ప్రయాణీకులు బయటకు వెళ్లేందుకు  ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు కారు అద్దాలు పగులగొట్టారు. కారులోని ఐదుగురిని బయటకు తీశారు.  కారులో  ఉన్న ఐదుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.  ఈ ప్రమాదంలో గాయపడిన  వారిని  స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  కారు అదుపుతప్పి  ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొనడానికి గల కారణాలపై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

 

click me!