వెంటాడుతున్న మృత్యువు: 8 ఏళ్లలో ఐదుగురు కొడుకులు మృతి, తల్లికి గుండెకోత

Published : Dec 20, 2019, 05:04 PM ISTUpdated : Dec 20, 2019, 05:08 PM IST
వెంటాడుతున్న మృత్యువు: 8 ఏళ్లలో ఐదుగురు కొడుకులు మృతి, తల్లికి గుండెకోత

సారాంశం

ఓ కుటుంబంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తుంటే వారిని కన్న తల్లికి ఎంతటి గర్భశోకం. సినిమా కథను తలపించే ఈ విషాదగాధ నిజామాబాద్‌లో జరిగింది.

ఓ కుటుంబంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తుంటే వారిని కన్న తల్లికి ఎంతటి గర్భశోకం. సినిమా కథను తలపించే ఈ విషాదగాధ నిజామాబాద్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రినగర్‌కు చెందిన షేక్ అబ్ధుల్ కరీం, రహీమున్నీసా బేగం దంపతులకు ఏడుగురు కొడుకులు. ఈ క్రమంలో అబ్ధుల్ కరీం 15 ఏళ్ల కిందట అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆయన భార్య రహీమున్నీసా ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసింది.

Also Read:‘టీ అమ్మనీకి పోయినా’’.. నేను ఉండుంటే దిశపై దారుణం జరిగేది కాదు

ఈ క్రమంలో 2011లో కుమారుడు షేక్ ఇర్ఫాన్ అనారోగ్యంతో మరణించాడు. ఈ విషాదం నుంచి తేరుకోకుండానే ఏడాది తిరక్కుండానే 2013లో పెద్ద కుమారుడు షేక్ బాబా కూడా అనారోగ్యంతో మరణించాడు. 2015లో నాలుగో కుమారుడు షేక్ మోబిన్ గూండ్ల చెరువులో స్నానానికి వెళ్లి.. ఈత రాకపోవడంతో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

ఆ తర్వాత 2017లో మూడో కుమారుడు షేక్ అజ్జు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఐదో కుమారుడు ముజాహిద్‌ గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.

Also Read:డెలీవరి సమయంలో శిశువు తల కోసేసిన వైద్యుడు, తల్లి గర్భంలోనే బిడ్డ మొండెం

వీరంతా కూడా ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్న వారే.. దానితో పాటు ఏ ఒక్కరికి పాతికేళ్లు కూడా నిండకపోవడం గమనార్హం. వృద్ధాప్యంలో తనకు తోడుగా ఉంటారనుకున్న కుమారులు ఒక్కొక్కరిగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో రహీమున్నీసా మానసికంగా కుంగిపోతున్నారు. ఇదే సమయంలో మిగిలిన ఇద్దరు కుమారులకు ఏమవుతుందోనని ఆమె ఆందోళన చెందుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu
రాష్ట్రంలోమంత్రులంతా దొరికిందిదోచుకోవడమే: KTR Comments on CM Revanth Reddy | Asianet News Telugu