మహిళ ఫోన్ తో బయటికి వచ్చిన చేపల వ్యాపారి కిడ్నాప్, హత్య

Published : Feb 04, 2020, 10:09 PM IST
మహిళ ఫోన్ తో బయటికి వచ్చిన చేపల వ్యాపారి కిడ్నాప్, హత్య

సారాంశం

రమేష్ అనే చేపల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, హత్య చేశారు. ఈ సంఘటన హైదరాబాదులోని జవహర్ నగర్ లో జరిగింది. కిడ్నాపర్లు 90 లక్షలు డిమాండ్ చేశారు. 

హైదరాబాద్: ఓ చేపల వ్యాపారిని హైదరాబాదులో దారుణంగా హత్య చేశారు. రమేష్ అనే చేపల వ్యాపారిని దుండగులు కిడ్నాప్ చేసి, హత్య చేశారు. ఓ మహిళ ఫోన్ కాల్ రావడంతో బయటకు వచ్చిన రమేష్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.

జవహర్ నగర్ లోని ఓ ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా గోనెసంచీలో శవం కనిపించింది. ఈ నెల 1వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు .

బోరబండలోని రామారావునగర్ లో నివాసం ఉంటున్న రమేష్ ను ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారని ఆ ఫిర్యాదులో చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి గాలింపు చర్యలు చేపట్టారు. 

మంగళవారం సాయంత్రం ఓ ఇంట్లో అతని శవాన్ని గుర్తించి, నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన రమేష్ ను కిడ్నాప్ చేసిన దుండగులు మర్నాడే అతన్ని హత్యచేసి గోనెసంచీలో చుట్టి పడేసినట్లు అనుమానిస్తున్నారు. రమేష్ విడుదలకు రూ.90 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు ఫోన్ చేసి డిమాండ్ చేశారు. ఫోన్ ఎక్కడి నుంచి చేశారో కనుక్కోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు రమేష్ మొబైల్ ఫోన్ కు వచ్చిన నెంబర్లను పరిశీలిస్తున్నారు. 

ఇదిలావుంటే, శ్రీనివాస్ అనే వ్యక్తిని ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తి నెల రోజుల క్రితం ఇద్దరు పిల్లలు, మహిళతో జవహర్ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నట్లు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu