మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకుపై  కాల్పులు

Published : Jul 28, 2017, 06:04 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకుపై  కాల్పులు

సారాంశం

ముఖేష్ గౌడ్ కొడుకు విక్రం పై కాల్పులు తెల్లవారుజామున కాల్పుల గటన రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రంగౌడ్

హైదరాబాద్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రం గౌడ్ పై కాల్పులు జరిగాయి.

ఆయనపై అగంతకులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. విక్రం శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి.

విక్రం కుడి భుజం, తలలోకి బుల్లెట్లు దూసుకుకుపోయాయి. ప్రస్తుతం విక్రం జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

తెల్లవారుజామున మూడున్నరకు బంజారాహిల్స్ లోని హఫీజ్ బాబా నగర్ లో ఈ కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ కాల్పుల ఘటనపై పోలీసులు పలురకాల అనుమానాలకు వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu