సికింద్రాబాద్ :రైల్ నిలయం పాత క్వార్టర్స్‌‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

Siva Kodati |  
Published : Feb 08, 2023, 10:11 PM IST
సికింద్రాబాద్ :రైల్ నిలయం పాత క్వార్టర్స్‌‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

సారాంశం

సికింద్రాబాద్ రైల్ నిలయం పాత క్వార్టర్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. 

సికింద్రాబాద్ రైల్ నిలయం పాత క్వార్టర్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?