పండగ పూట వరంగల్ జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి..

Published : Oct 22, 2023, 01:22 PM IST
పండగ పూట వరంగల్ జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మృతి..

సారాంశం

దసరా పండగ వేళ వరంగల్ జిల్లాలో రాయపర్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది.

దసరా పండగ వేళ వరంగల్ జిల్లాలో రాయపర్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పండగ కోసమని కూతరు-అల్లుడిని ఇంటికి తీసుకొచ్చి సరదాగా గడుపుదామని అనుకున్న కుటుంబంలో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. వివరాలు.. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాలకు చెందిన వెంకన్న కూతురు అనూష, అల్లుడు రాజేశ్‌ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. దసరా పండగ వేళ కూతురు-అల్లుడును మొరిపిరాలలోని తన నివాసానికి తీసుకొచ్చేందుకు వెంకన్న హైదరాబాద్‌కు వెళ్లాడు. 

అయితే కూతురు అల్లుడుని హైదరాబాద్ నుంచి మెరిపిరాలకు తీసుకొస్తున్న సమయంలో.. రాయపర్తి మండలం కిష్టాపురం సమీపానికి రాగానే వాళ్లు ప్రయాణిస్తున్న బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్న, అనూష అక్కడికక్కడే మృతి చెందారు. రాజేశ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే రాజేష్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారంఅందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

Real Estate: తెలంగాణ‌లో 2 కొత్త ఎయిర్ పోర్టుల‌కు ముహుర్తం ఖ‌రారు.. ఇక్క‌డ భూములు కొన్న వారి రాత మారిన‌ట్లే
అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా? | Asianet News Telugu