ఆర్ధిక ఇబ్బందులు: రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు పిల్లలను చంపి తండ్రి సూసైడ్

Published : Mar 04, 2024, 09:17 AM IST
 ఆర్ధిక ఇబ్బందులు: రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు పిల్లలను చంపి తండ్రి సూసైడ్

సారాంశం

చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో అధికంగా చోటు చేసుకుంటున్నాయి.  రంగారెడ్డి జిల్లాలో  ఇదే తరహా ఘటన ఒకటి ఇవాళ వెలుగు చూసింది.

హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లిలో సోమవారం నాడు విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి. అప్పుల బాధ తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన రవి  తన ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే రవి ఈ దారుణానికి పాల్పడినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

also read:అదే కొంపముంచింది: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేసీఆర్

ఓ స్కీంలో  ఆదిక ఆధాయం కోసం పెట్టిన పెట్టుబడితో ఆర్ధికంగా రవి ఇబ్బందులకు గురైనట్టుగా స్థానికులు చెబుతున్నారు.ఈ కారణంగానే  రవి ఆత్మహత్య చేసుకున్నాడా ఇతరత్రా కారణాలున్నాయా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

also read:లోక్‌సభ ఎన్నికలు 2024: నేడు తొలి జాబితా విడుదల చేయనున్న బీఆర్ఎస్

ఆత్మహత్యలు పరిష్కారం కాదు

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనుమానంగా క‌నిపించిన న‌లుగురు.. డౌట్ వ‌చ్చి బ్యాగులు చెక్ చేయ‌గా.!
Weather Report: ఊపిరి పీల్చుకోండి.. వ‌చ్చే 4 రోజులు వ‌ర్షాలు. ఈ ప్రాంతంలో మాత్రం ఉరుములు, మెరుపులు