తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. తెలంగాణ అయ్యప్ప భక్తుల మరణం..

Published : Dec 17, 2023, 05:48 PM IST
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. తెలంగాణ అయ్యప్ప భక్తుల మరణం..

సారాంశం

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident in Tamil nadu) తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులు  మరణించారు (3 Telangana Ayyappa devotees dead). ములుగు జిల్లా (mulugu district) కు చెందిన ఈ భక్తులు శబరిమలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.   

tamilnadu road accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో తెలంగాణకు చెందిన అయ్యప్ప భక్తులు మరణించారు. మద్రాస్‌ బైపాస్‌ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

బీఆర్ఎస్ పై కక్ష సాధింపు చర్యలు ఉండబోవు,. గత ప్రభుత్వ పాలసీలు బాగుంటే కొనసాగిస్తాం - మంత్రి శ్రీధర్ బాబు

ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు ఓ కారులో కేరళలోని శబరిమలకు వెళ్లారు. అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం అదే కారులో తిరుగు ప్రయాణం ప్రారంభించారు. ఆ వాహనం ఆదివారం మధ్యాహ్నం సమయంలో తమిళనాడులోని మద్రాస్ బైపాస్ రోడ్డుకు చేరుకుంది. ఈ క్రమంలో ఆ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. 

మధ్యధరా సముద్రంలో పడవ బోల్తా.. 60 మంది దుర్మరణం.. మృతుల్లో మహిళలు, చిన్నారులు..

ఈ ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప దీక్షాపరులు అక్కడికక్కడే మరణించారు. వీరిని సుబ్బయ్య నాయుడు, నరసాంబయ్య, రాజుగా గుర్తించారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందగానే తమిళనాడు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో క్షతగాత్రులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. అలాగే మృతదేహాలను కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ప్రమాదంపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనతో కమలాపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?