బాలుడి కిడ్నాప్.. చితకబాదిన కుటుంబసభ్యులు

Published : Aug 25, 2020, 11:08 AM ISTUpdated : Aug 25, 2020, 11:16 AM IST
బాలుడి కిడ్నాప్.. చితకబాదిన కుటుంబసభ్యులు

సారాంశం

నవీపేట మండలం దండిగుట్టకు చెందిన లక్ష్మి అనే మహిళ ఈ నెల 17న బస్టాండ్‌లో వుండగా...బాసరకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మాటలు కలిపాడు. ఆ తర్వాత ఆమె ఏడాదిన్నరబాబును ఎత్తుకుపోయాడు.

నిజామాబాద్ లో కిడ్నాప్ కలకలం రేగింది. ఓ వ్యక్తి.... ఓ మహిళ చేతిలోని పసిబిడ్డను ఎత్తుకువెళ్లాడు. కాగా.. ఆ కిడ్నాపర్ ని వెతికి పట్టుకొని మరీ చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నవీపేట మండలం దండిగుట్టకు చెందిన లక్ష్మి అనే మహిళ ఈ నెల 17న బస్టాండ్‌లో వుండగా...బాసరకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మాటలు కలిపాడు. ఆ తర్వాత ఆమె ఏడాదిన్నరబాబును ఎత్తుకుపోయాడు.

బిడ్డ కోసం 15 రోజులు వెతికి వేసారి పోయిన లక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులకు చివరికి నిజామాబాద్‌ మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద నాగరాజు కన్పించాడు. బిడ్డ ఎక్కడున్నాడో చెప్పమంటూ చెట్టుకు కట్టి గ్రామస్తులు నాగరాజును చితక్కొట్టారు. ఆ రోజే తన వద్ద బాబును ఎవరో ఎత్తుకెళ్లారంటూ సమాధానం చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. బిడ్డ జాడ మాత్రం ఇంతవరకు దొరకలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu