కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్నారు

Published : Dec 19, 2017, 09:28 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్నారు

సారాంశం

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో విషాధం చోటుచేసుకుంది

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో విషాధం చోటుచేసుకుంది. మండలంలోని తుర్కోనిగుంటలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసున్నారు. ఈ ఘటన మండలంలో పెద్ద సంచలనంగా మారింది. ఆర్ధిక ఇబ్బందులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. కుటుంబపెద్ద భగవాన్ రెడ్డి రాసిన సూసైడ్ నోట్ కారణంగా ఆర్ధిక ఇబ్బందులతోనే వారంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. భగవాన్ రెడ్డి కొడుకు రఘోత్తమరెడ్డి, కూతురు భవానీ ఇద్దరూ ఎంబిఏ పూర్తి చేసారు. కుటుంబం మొత్తం పురుగుల మందు తాగారు. అయితే పురుగుల మందు తాగటంతో పాటు కుటుంబ పెద్ద ఉరి కూడా వేసుకున్నారు. అయితే, సీరియస్ గా ఉన్న భార్య రాజమ్మను స్ధానికులు కరీనంగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు.. నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత.. అసలు ఏం జరిగింది?
Weather Update: తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులు వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలర్ట్