మీ వల్ల నా చేయి పరిస్థితి చూడండి: కేంద్ర మంత్రిని నిలదీసిన మధుయాష్కి

By Arun Kumar PFirst Published Oct 5, 2020, 1:01 PM IST
Highlights

న్యూడిల్లీ విమానాశ్రయంలో కెమికల్స్ కలిగిన సిరాతో స్టాంపింగ్ చేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. 

న్యూడిల్లీ: దేశంలో కరోనా నియంత్రణ చర్యలో భాగంగా విదేశాల నుండి వచ్చేవారికి గుర్తించేందుకు విమానాశ్రయాల్లో స్టాంపింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా చేతిపై చేస్తున్న ఈ స్టాంపింగ్ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఇలా కెమికల్స్ కలిగిన సిరాతో స్టాంపింగ్ చేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి ఫిర్యాదు చేశారు. 

''ప్రియమైన హర్దీప్ సింగ్ పూరీ గారికి...విదేశాల నుండి వచ్చేవారి చేతిపై డిల్లీ విమానాశ్రయంలో వేస్తున్న స్టాంపింగ్ కోసం ఉపయోగిస్తున్న కెమికల్స్ ను ఓ సారి పరిశీలించండి. నిన్న నాకు కూడా డిల్లీ విమానాశ్రయంలో స్టాంప్ వేశారు. దానివల్ల నా చేతి పరిస్థితి చూడండి'' అంటూ స్టాంప్ చేసిన తన చేయిని పోటో తీసి ట్వీట్ కు జత చేశారు మధుయాష్కి. ఈ ట్వీట్ ను విమానయాన మంత్రికి ట్యాగ్ చేశారు. 

Dear Ji, can you please look into the chemical being used at Delhi airport for stamping on passengers coming from abroad? Yesterday I was stamped at and this is how my hands look now. pic.twitter.com/Gt1tZvGc8L

— Madhu Goud Yaskhi (@MYaskhi)

మధుయాష్కి ట్వీట్ పై స్పందించిన విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ దీనిపై ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా  ఛైర్మన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. దీంతో ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ఢిల్లీ విమానాశ్రయ అధికారులు కూడా స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలిస్తామని... స్టాంపింగ్ కోసం ఉపయోగించిన ఇంకును నిపుణుల చేత పరీక్ష జరిపిస్తామన్నారు. ప్రమాదకరమని తేలితే చర్యలు తీసుకుంటామని విమానయాన శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 
 

click me!